
నిజామాబాద్, వెలుగు: దరఖాస్తు చేసుకున్న అర్హులకు 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయా శాఖల ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఇండ్ల లబ్ధిదారుల పేర్లను రెండు రోజుల్లో ప్రధాన మంత్రి గ్రామీణ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకుని ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్ ఉన్నారు.
పట్టాదారు పాస్పుస్తకం తీసుకోకుండా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలు రూ.239.17 కోట్ల విలువ ఫ్రీ జర్నీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సంబురాలు నిర్వహించనున్నామన్నారు. వర్షాలతో ఇబ్బంది వస్తే 08462–220183కి ఫోన్ చేయాలన్నారు. మోపాల్ మండలం కంజర జ్యోతిబాపూలే పాఠశాలను కలెక్టర్ విజిట్ చేసి స్టూడెంట్స్తో మాట్లాడారు.