సర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండాల్సిందే : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

సర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండాల్సిందే : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : సర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్​ వినయ్ ​కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్​పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ను విజిట్​ చేసి మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలకు ఎక్కువ శాతం పేదలే వస్తారన్నారు. సాధ్యమైనంత వరకు  నార్మల్​ డెలివరీలు చేయాలన్నారు. 

ప్రతి రోజు సీహెచ్​సీ, పీహెచ్​సీల పనితీరు పర్యవేక్షించాలని డీఎంహెచ్​వో రాజశ్రీని ఆదేశించారు. ప్రతి నెలా రెండో శనివారం నిర్వహించే ఆరోగ్యశ్రీ క్యాంప్​లకు అన్ని విభాగాల డాక్టర్లు హాజరయ్యేలా చూడాలన్నారు. కమ్యూనిటీ సెంటర్లలోని స్టాఫ్ హాజరును పరిశీలించారు. ఓపీ చెక్ చేసి, ల్యాబ్, ఇన్​పేషెంట్ వార్డులు తనిఖీ చేశారు. తరువాత తహసీల్దార్​ ఆఫీస్​కు​ వెళ్లి భూభారతి అప్లికేషన్లను పరిశీలించారు. భూభారతి అప్లికేషన్లపై తహసీల్దార్​ సతీష్​రెడ్డికి సూచనలు ఇచ్చారు.