నిజామాబాద్ జిల్లాలో జూలై 10 నుంచి మహిళా శక్తి సంబురాలు : కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి

నిజామాబాద్ జిల్లాలో జూలై 10 నుంచి మహిళా శక్తి సంబురాలు :  కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఈ నెల 10 నుంచి 16 వరకు మహిళా శక్తి సంబురాలు నిర్వహించాలని కలెక్టర్​ వినయ్ ​కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. 8న మండల సమాఖ్యలతో, 9న విలేజ్ సమాఖ్యలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హతగల ప్రతి సంఘానికి ఆ రోజు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేయాలన్నారు. ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. ఫ్రీ బస్ మొదలుకొని శక్తి క్యాంటీన్​ల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్​లు, వడ్ల కొనుగోలు సెంటర్లు, పెట్రోల్ బంక్​లు, సోలార్ పవర్​ ప్లాంట్​లు మంజూరు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించేలా గవర్నమెంట్ తోడ్పాటు అందిస్తోందన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్​, జిల్లా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈవీఎం గోదామ్​ కలెక్టర్​ విజిట్..​

నిజామాబాద్ వినాయక్​నగర్​లోని ఈవీఎం గోదామ్​ను సోమవారం కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సందర్శించారు. రెగ్యూలర్​ తనిఖీల్లో భాగంగా గోదామ్ సీళ్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు చెక్​ చేసి పోలీస్ బందోబస్తును సమీక్షించారు. అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్, ఏవో ప్రశాంత్, సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు.