నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్  జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో యూరియా కొరతలేదని, సరిపడా యూరియా నిల్వ ఉందని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మాక్లూర్ మండలం అమ్రాద్ విలేజ్​లోని సింగిల్​ విండో గోదాంలోని యారియా స్టాక్​ను పరిశీలించి మాట్లాడారు.  యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  తహసీల్దార్ ఆఫీస్​కు వెళ్లి భూభారతి అప్లికేషన్ల ఆన్​లైన్ తీరును పరిశీలించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, వాటి విచారణ రిపోర్టును చూసి తహసీల్దార్ శేఖర్​కు సూచనలు చేశారు.

 సీజనల్​ వ్యాధులపై అలర్ట్​గా ఉండాలని ఎంపీడీవో నర్సింహారెడ్డికి సూచించారు. దోమల నివారణకు ఫాగింగ్​ షురూ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టికి పెట్టాలన్నారు. అమ్రాద్​ తండాలో కెనాల్​ కట్టపై గతేడాది నాటిన మొక్కలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సర్కార్​ హాస్పిటల్స్​లోనే కాన్పులు జరగాలి

సర్కార్​ హాస్పిటల్స్​లో ఆపరేషన్లు లేకుండా నార్మల్​ డెలివరీలు చేయాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు.  గతంతో పోలిస్తే గవర్నమెంట్ దవాఖానాల్లో ఆపరేషన్​ల సంఖ్య ఎందుకు పెరిగాయో తెలుపాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో మెడికల్ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. నార్మల్​ డెలీవరీల కోసం ప్రయత్నం చేయాలన్నారు.  నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్న సర్కార్​ హాస్పిటల్స్​లో అశ్రద్ధ చేయొద్దన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ తదితరులు ఉన్నారు.