
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: వర్షాలు కురుస్తున్నందున వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఆయా శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా యంత్రాంగం అలర్ట్గా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రానీయొద్దన్నారు. ఆయిల్పామ్ సాగు లక్ష్యం 3500 ఎకరాలు కాగా, 1,242 ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు ఒప్పుకున్నందున పనుల్లో వేగం పెంచాలన్నారు.
సీజనల్ వ్యాధులు, టీబీ ముక్త్భారత్ పై ఫోకస్ పెట్టాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ, పీహెచ్సీ, సబ్ సెంటర్ పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.