
నిజామాబాద్, వెలుగు : సర్కార్ స్కూల్స్ వీడుతున్న డ్రాపౌట్ విద్యార్థులపై దృష్టి సారించి తిరిగి చేరేలా చొరవ చూపాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి కోరారు. సోమవారం ఆయన జిల్లాలోని ఎంఈవోలతో కలెక్టరేట్లో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుపడ్డాయని, టీచర్ల కొరత తీరిందని, నాణ్యమైన బోధన, ఫ్రీ యూనిఫారాలు, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, ఎండీఎం విషయాలపై పేరెంట్స్కు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. బడిబాటతో అడ్మిషన్లు పెరిగాయన్నారు.
టెన్త్ ముగించాక పై చదువులకు వెళ్లని స్టూడెంట్స్ వివరాలు సేకరించాలన్నారు. కిచెన్ షెడ్స్ అవసరమున్న బడుల వివరాలు అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, డీఈవో అశోక్ తదితరులు ఉన్నారు. మోపాల్ మండలం కంజర్ విలేజ్లోని జడ్పీ హైస్కూల్ను కలెక్టర్ విజిట్ చేశారు. రూ.11.20 లక్షలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తాగునీరు, కరెంట్ వసతి కల్పించి రిపేర్లు పూర్తి చేశారని హెచ్ఎం గోపాలచారి తెలిపారు.