
- డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో రూల్స్కు విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఇందుకోసం నియమించిన కమిటీ నిరంతరం నిఘా కొనసాగిస్తుందన్నారు.
సోమవారం ఆమె తన ఆఫీస్లో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కొత్తగా జిల్లాలో రెండు స్కానింగ్ సెంటర్ల అనుమతి, నిబంధనలు పాటించని రెండు కేంద్రాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. డాక్టర్ శ్వేత, డాక్టర్ ఇందు, డాక్టర్ సుప్రియ, డాక్టర్ తుకారామ్ రాథోడ్ పాల్గొన్నారు.