
నిజామాబాద్, వెలుగు : మండల అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్లు పెండింగ్ పనులపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. లోకల్బాడీ, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ, హాస్పిటల్ పనులు యుద్ధ ప్రాతిపదికన ముగిసేలా చొరవ చూపాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇంకా ఏమైనా అవసరాలుంటే కమిటీలు ప్రతిపాదనలు పంపేలా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూరియా నిల్వల సమాచారం రైతులకు తెలిసేలా షాప్ల ఎదుట బోర్డులు పెట్టించాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ పాల్గొన్నారు.
నవీపేట్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నవీపేట్, వెలుగు : మండల కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్స్, అంగన్వాడీ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సేవలపై ఆరా తీశారు. ధర్యాపూర్ గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పై ఆరా తీశారు. వెటర్నరీ హాస్పిటల్, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేశారు. ‘భూభారతి’ అప్లికేషన్లు త్వరగా
పరిష్కరించాలన్నారు.