తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ రేటు

తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ రేటు

న్యూఢిల్లీ: హోటళ్లు,  రెస్టారెంట్లు వంటి సంస్థలు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్​ ధర తగ్గింది. 19 కిలోల ఎల్‌‌‌‌పీజీ సిలిండర్ ధరను రూ.19 తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.  19 కిలోల సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ. 1,745.50కి దిగివచ్చింది. నెలవారీగా ధరలు తగ్గించడం ఇది రెండోసారి.

 ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 749.25 లేదా 0.7 శాతం పెరిగి దేశ రాజధానిలో రూ.1,01,642.88కి చేరుకుంది.   ముంబైలో ధరలు కిలోలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.94,466.41 నుంచి రూ.95,173.70కి పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.