
ముషీరాబాద్, వెలుగు: కమ్యూనిస్టు ఉద్యమాలు పేద ప్రజల కోసమేనని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఐద్వా సీనియర్ నాయకురాలు సి.అరుణ సంస్మరణ సభ ఆదివారం రాత్రి హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం అరుణ పని చేశారన్నారు. పేదల కోసం చేపట్టిన ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వామపక్ష సంఘాల నేతలు పాల్గొన్నారు.