షారుఖ్, సచిన్, కోహ్లీకి షాక్..పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు

షారుఖ్, సచిన్, కోహ్లీకి షాక్..పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు
  • పంజాగుట్టలో కంప్లయింట్ ఇచ్చిన యువకుడు

పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్​చేసిన చిన్న యూట్యూబ్ స్టార్స్​పైనే కేసులు పెడతారా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్​చేసిన బాలీవుడ్​స్టార్​షారుఖ్ ఖాన్, క్రికెటర్లు సచిన్​టెండూల్కర్, విరాట్ కోహ్లీపై పెట్టరా అని హైదరాబాద్ గ్రీన్స్ సంస్థ ప్రెసిడెంట్ అర్జున్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఏ23 రమ్మీకి షారుఖ్ ఖాన్, పేటీఎం ఫస్ట్ గేమ్ కు సచిన్ టెండూల్కర్, ఎంపీఎల్– మిడిల్ ప్రీమియర్ లీగ్ యాప్​లను ప్రమోట్​చేస్తున్నారని పేర్కొన్నారు. వీటితో ఎంతో మంది టీనేజర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. అయితే పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించకుండా పంపించి వేశారు.