- మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను మోసగించిన సైబర్ ఫ్రాడ్
కోల్బెల్ట్,వెలుగు: మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను నమ్మించి సైబర్ మోసగాడు రూ. లక్షల్లో కాజేశాడు. రామకృష్ణాపూర్ టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేశ్ తెలిపిన మేరకు.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్కు చెందిన మహిళ వాట్సాప్ కు కొద్ది నెలల కింద మెసేజ్ వచ్చింది. రెస్టారెంట్స్కు ఫైవ్స్టార్ రేటింగ్ఇస్తూ అధికంగా డబ్బులు సంపాదించవచ్చని అందులో ఉంది. అనంతరం సైబర్మోసగాడు ఒక టెలిగ్రామ్ లింక్ను పంపించాడు.
ఆమెకు కొన్ని టాస్క్లు ఇచ్చి పూర్తి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పగా.. నమ్మిన ఆమె తొమ్మిది సార్లు రూ.2 లక్షలను ట్రాన్స్ ఫర్ చేసింది. డబ్బులు తిరిగి రాకపోవడం, వాట్సాప్ నంబర్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని బాధితురాలు ఆదివారం సైబర్ క్రైమ్ టోల్ఫ్రీ నంబర్1930కు కాల్ చేసి కంప్లయింట్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి యాప్స్, వెబ్సైట్, ఆన్లైన్లింక్స్, కాల్స్కు రిప్లై ఇవ్వొద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ భూమేశ్ సూచించారు.
