నర్సంపేట టౌన్ లోని వేద స్కానింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి : బాధిత కుటుంబ సభ్యులు

నర్సంపేట టౌన్ లోని వేద  స్కానింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి : బాధిత కుటుంబ సభ్యులు

నర్సంపేట, వెలుగు : తప్పుడు గర్భ నిర్ధారణ రిపోర్టు ఇచ్చిన వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్​లోని వేద స్కానింగ్ సెంటర్​పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం కలెక్టర్, డీఎంహెచ్​వో ఆఫీస్​లో ఫిర్యాదు చేశారు. దుగ్గొండి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్​ యువతి కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల నర్సంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పటల్​కు వెళ్లిందన్నారు. 

డాక్టర్ సూచన మేరకు వేద స్కానింగ్ సెంటర్​లో వైద్య పరీక్షలు చేయించగా, ప్రెగ్నెన్సీ కన్​ఫం అంటూ ఫేక్​ రిపోర్టు ఇచ్చారని వాపోయారు. తప్పుడు రిపోర్టుపై స్కానింగ్​ సెంటర్​లోని డాక్టర్లను నిలదిస్తే తమపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేద స్కానింగ్ సెంటర్​పై చర్యలు తీసుకోవాలని కోరారు.