స్పౌజ్​ ట్రాన్స్​ఫర్లు పూర్తి చేయండి

స్పౌజ్​ ట్రాన్స్​ఫర్లు పూర్తి చేయండి

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ ట్రాన్స్​ఫర్ల చేశారని, ఇంకా సుమారు 1500 ఎస్జీటీ, భాషపండితులు, పీఈటీ  స్పౌజ్ బదిలీలు పూర్తిచేయాలని కోరుతూ పలువురు టీచర్లు ఎమ్మెల్సీ కవితను కలిశారు.

 ఈ మేరకు శుక్రవారం ఆమెను క్యాంపు ఆఫీస్​లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ట్రాన్స్​ఫర్లు ఆపేయడంతో కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాల్సి వస్తుందన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం సభ్యులు సుధాకర్,  రాజేశ్వరి, మనోజ, వందన పాల్గొన్నారు.