స్కూల్​ టైంకు బస్సు నడపాలని స్టూడెంట్ల ఆందోళన

స్కూల్​ టైంకు బస్సు నడపాలని స్టూడెంట్ల ఆందోళన

అయిజ, వెలుగు: స్కూల్ టైంకు అనుగుణంగా పల్లె వెలుగు బస్సు నడపాలని రాజోలి మండలం పచ్చర్ల గ్రామ విద్యార్థులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సుమారు 40 మంది స్టూడెంట్లు ప్రతి రోజు మాన్ దొడ్డి గ్రామానికి చదువుకునేందుకు వెళ్తున్నారని, స్కూల్ టైం కు బస్సు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్నారు. చాలా సార్లు అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు.