
నవీపేట్, వెలుగు: నవీపేట్లోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చిందని వినియోగదరులు ఆందోళనకు దిగారు. ఆదివారం రాత్రి రాంపూర్ గ్రామానికి చెందిన పవన్, పోశెట్టి పొలంలో మందు కొట్టే మెషిన్ కోసమని బాటిల్లో లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నారు. బాటిల్ లో ఉన్న పెట్రోల్కల్తీదని గుర్తించిన వినియోగదారులు బంక్ సిబ్బందిని ఇదేంటని ప్రశ్నించారు. గతంలోనూ కల్తీ పెట్రోల్ విక్రయించారని, సంబంధిత అధికారులు బంక్యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.