చైతన్య పురిలో ఘటన
దిల్ సుఖ్ నగర్, వెలుగు: చైతన్యపురిలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ లో ఆయిల్కొట్టించి కొద్ది దూరంగా వెళ్లగానే వాహనాలు నిలిచి పోయాయి. పెట్రోల్ పై అనుమానం వచ్చిన వాహనదారులు బంక్ వద్దకు వచ్చి ఖాళీ బాటిల్స్ లో నింపమని చెప్పారు. పెట్రోల్నీళ్ల రంగులో ఉండటంతో వాహనదారులు అవాక్కయ్యారు.
కల్తీపై మాకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం తో వాహనదారులు బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం దాదాపు 10 నుంచి 20మంది వాహనదారులు చైతన్య పురి పీఎస్లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిన్నగౌడ్, ప్రసాద్, రమేష్, షఫీ, అప్పన్న, యశ్వంత్ సాయి, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
