
పాకిస్తాన్ విషయంలో భారత వైఖరి మారదని ఇండియా ప్రకటించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన సందర్భంగా సీజ్ ఫైర్ పై భారత్ స్పష్టతనిచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం షరతులతో కూడుకున్నదనీ పేర్కొంది. అయితే కాల్పుల విరమణకు ముందూ, తర్వాత ఎలాంటి షరతులు పెట్టుకోలేదని, కేవలం కాల్పుల విషయంలోనే ఈ ఒప్పందం అని పేర్కొంది.
ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరి మారదని.. ఉగ్రవాదాన్ని పోషించే పాక్ విషయంలోనే ఒకటేమాట అని స్పష్టం చేసింది ఇండియా. అదే విధంగా దౌత్యపరమైన చర్యల విషయంలోనూ భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఇందులో భాగమని తెలిపింది. సింధూ జలాల ఒప్పందం రద్దు విశయంలో ఎలాంటి మార్పు లేదని.. తమ నిర్ణయాన్ని కొనసాగిస్తామని విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి.
కాల్పుల విరమణ చర్చల ప్రక్రియను పాకిస్తాన్ ప్రారంభించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై భారతదేశం రాజీలేని పోరాటం చేస్తామని , టెర్రరిజం విషయంలో తమ వైఖరి ఎప్పటికీ మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించడం గమనార్హం.
►ALSO READ | కాల్పుల విరమణ స్వాగతిస్తున్నాం.. జమ్మూకాశ్మీర్ లో సహాయక చర్యలు ప్రారంభించండి:ఒమర్ అబ్దుల్లా
కాల్పుల విరమణ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విదేశాంగ శాఖ..పాకిస్తాన్ దాడి చేసిన మూడు పెద్ద క్షిపణులు, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిందనీ, అదే సమయంలో పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలపై ఇండియా దాడి చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో పాక్ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు.
పాకిస్తాన్ చేసే ప్రతి దాడినీ తీవ్రంగా పరిగణిస్తామని, భవిష్యత్తులో పాక్ నుంచి ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే దానిపై ఘాటుగా స్పందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఉగ్రదాడులను ఇండియాపై దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.