
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లెటర్పై ఇన్వెస్టిగేషన్ఆఫీసర్లలో అయోమయం నెలకొంది. తాను ఇప్పట్లో భారత్కు రాలేనని, అవసరమైతే ఈ–మెయిల్/టెలీ కాన్ఫరెన్స్ద్వారా విచారణకు హాజరవుతానని ఇటీవల దర్యాప్తు అధికారులకు ప్రభాకర్రావు మెయిల్ పంపారు. మరోవైపు ప్రభాకర్రావుతో పాటు టాస్క్ఫోర్స్మాజీ డీసీపీ రాధాకిషన్రావును విచారించేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతించింది. కానీ, ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో భారత్కు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మల్లగుల్లాలు పడ్తున్నారు. గత నెల 23న, తాజాగా ప్రభాకర్ రావు రాసిన లెటర్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు జత చేయలేదు.
దీంతో ఆ లెటర్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే సంశమయంలో అధికారులు పడ్డారు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభాకర్రావును ప్రశ్నించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఫోన్ట్యాపింగ్ తీవ్రమైన నేరం కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడంతో విచారణకు కోర్టు అనుమతి తప్పనిసరిగా మారింది. ఈ మేరకు దర్యాప్తునకు అనుమతి కోరుతూ పోలీసులు కోర్టులో మెమో లేదంటే పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.