ఓర్వలేక టీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు

 ఓర్వలేక టీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు
  • మాజీ ఎమ్మెల్యే  బాణోత్ మదన్ లాల్

వైరా, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే ముందుకు పోతానని, టీఆర్ఎస్ లోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బానోత్​ మదన్​లాల్​ పేర్కొన్నారు.  గురువారం వైరాలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మదన్​లాల్​మాట్లాడుతూ దేశంలో  కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలు, పరిపాలన గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని, రాష్ర్టంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో వైరా రిజర్వాయర్​ను సాగర్​జలాలతో నింపేందుకు తిమ్మారావుపేట ఎస్కేప్ వద్ద కాలువపై రాత్రుళ్లు నిద్రించిన సంగతిని గుర్తు చేశారు.

ఆ సమయంలో పోలీసులు కేసులు పెట్టినట్లు వివరించారు. వైరా రిజర్వాయర్ ను మినీ ట్యాంక్ బండ్​ గా మార్చేందుకు అప్పటి మంత్రి హరీశ్​రావుకు సమస్యను వివరించి, పోరాడి ఫండ్స్​శాంక్చన్​చేయించినట్లు చెప్పారు. వైరా నూతన మున్సిపాలిటీకి రూ.20 కోట్ల ఫండ్స్​తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు.  గరికపాడు సొసైటీ చైర్మన్​అయిలూరి కృష్ణారెడ్డి,  కొండకూడెం సర్పంచ్ శ్రీనివాసరావు, తాడిపూడి సర్పంచ్ భద్రయ్య, సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ,ఖానాపురం ఉప సర్పంచ్ భూపతి రెడ్డి, గొల్లపూడి హరినాథ్ బాబు, శ్రీనివాసరావు, ప్రసాద్, రామారావు, చింతయ్య, ఆదినారాయణ, కృష్ణమూర్తి, చిన్ని, భాస్కరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.