- మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్
వైరా, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే ముందుకు పోతానని, టీఆర్ఎస్ లోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. గురువారం వైరాలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్లాల్మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజా సమస్యలు, పరిపాలన గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని, రాష్ర్టంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో వైరా రిజర్వాయర్ను సాగర్జలాలతో నింపేందుకు తిమ్మారావుపేట ఎస్కేప్ వద్ద కాలువపై రాత్రుళ్లు నిద్రించిన సంగతిని గుర్తు చేశారు.
ఆ సమయంలో పోలీసులు కేసులు పెట్టినట్లు వివరించారు. వైరా రిజర్వాయర్ ను మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు అప్పటి మంత్రి హరీశ్రావుకు సమస్యను వివరించి, పోరాడి ఫండ్స్శాంక్చన్చేయించినట్లు చెప్పారు. వైరా నూతన మున్సిపాలిటీకి రూ.20 కోట్ల ఫండ్స్తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. గరికపాడు సొసైటీ చైర్మన్అయిలూరి కృష్ణారెడ్డి, కొండకూడెం సర్పంచ్ శ్రీనివాసరావు, తాడిపూడి సర్పంచ్ భద్రయ్య, సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ,ఖానాపురం ఉప సర్పంచ్ భూపతి రెడ్డి, గొల్లపూడి హరినాథ్ బాబు, శ్రీనివాసరావు, ప్రసాద్, రామారావు, చింతయ్య, ఆదినారాయణ, కృష్ణమూర్తి, చిన్ని, భాస్కరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.