- కాంగ్రెస్కు చైర్ పర్సన్, బీజేపీకి వైస్ చైర్ పర్సన్
నాగర్ కర్నూల్, వెలుగు : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడింది. 8 వార్డులు గెలిచిన బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్కు చైర్మన్ పదవి ఇస్తామని బీజేపీ నాయకులు ఇచ్చిన ఆఫర్కు ఓకే చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఆమనగల్ మున్సిపాలిటీలో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు. ఆమనగల్మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, బీఆర్ఎస్8 వార్డులు, బీజేపీ 5 వార్డులు, కాంగ్రెస్ ఒక వార్డులో విజయం సాధించాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి చైర్ పర్సన్ సీటుపై కుర్చుంటారనే భావించారు. బీఆర్ఎస్కు చెందిన ఒక నాయకుడు వరుస వీడియో మెసేజులతో పాటు కల్వకుర్తి మున్సిపాలిటీలో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టినట్టు తెలియడంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. కల్వకుర్తి మున్సిపాలిటీలోని తమ అభ్యర్థులను కట్టడిచేస్తూనే ఆమనగల్లో బీఆర్ఎస్కు చెక్ పెట్టారు.
బీజేపీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకుడు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్మల్లు రవిని కలిసి చైర్పర్సన్ పోస్ట్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, మల్లు రవి ఆదివారం ఆమనగల్ మున్సిపాలిటీలో ఎక్స్అఫిషీయో మెంబర్లుగా పేర్లు నమోదు చేసకున్నారు. దీంతో ఆమన్గల్లో ఒక స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్కు అదృష్టం కలిసి వచ్చినట్టయ్యింది.
