డోర్నకల్లో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఘర్షణ

డోర్నకల్లో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఘర్షణ

 రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నారు. పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేస్తున్నారు. అయితే  మహబూబాబాద్ డోర్నకల్ లో   బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య  ఉద్రిక్తత నెలకొంది.   

  కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నించాయి.  కాంగ్రెస్ వేడుకల కార్యక్రమం దగ్గరకు బీఆర్ఎస్ నాయకులు  ర్యాలీతో దూసుకొచ్చారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య  తీవ్ర తోపులాట జరిగింది.  పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసలు కల్గజేసుకుని  ఇరుపార్టీల నేతలను చెదరగొట్టారు. 

డోర్నకల్లో జూన్ 1న  బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అవవతరణ దినోత్సవం సందర్భంగా ముత్యాలమ్మ సెంటర్ దగ్గర జెండాను ఎగురవేయడానికి బీఆర్ఎస్ నేతలు  గద్దెను ఏర్పాటు చేశారు. అదే చోట కాంగ్రెస్ నేతలు స్టేజ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు.ఈ క్రమంలో ఇవాళ అవతరణ దినోత్సవాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.