మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో కార్యకర్తలు, నాయకులు గెలుపు సంబురాలు జరుపుకొన్నారు. శుక్రవారం వెలువడిన ఫలితాలతో ఆ పార్టీ నేతలు రంగులు చల్లుకుని, పటాకులు పేల్చి వేడుకలు నిర్వహించుకున్నారు.
మహబూబాబాద్ మరిపెడలో ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ విజేతలతో కలిసి సంబురాలు చేసుకోగా, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకులు జరుపుకున్నారు. కాగా, పలుచోట్ల లెప్ట్ పార్టీ నేతలు గెలుపొందగా, సంబురాలు చేసుకున్నారు.
