- ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్కు ఏఐసీసీ మెంబర్, ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచితేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్కు అవకాశం ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఎండలు బాగా పెరిగాయని, పోలింగ్జరిగే మే 13 నాటికి జనం మధ్యాహ్నం టైమ్లో బయటకు వచ్చే అవకాశం ఉండదని, సమయం పెంచితేనే అందరూ ఓటేసే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్కు అవకాశం ఇచ్చారని, ఆ అంశంపై మరోసారి రివ్యూ చేయాలని లేఖలో కోరారు.