![బీఆర్ఎస్ నాయకులను నిలదీయండి : భూపతిరెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/11/congress-candidate-bhupathi-reddy_rYAM4ODGL9.jpg)
నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, బూటకపు వాగ్దానాలతో గ్రామాల్లో తిరుగుతున్న బీఆర్ఎస్ లీడర్లను ప్రజలు నిలదీయాలని మాజీ ఎమ్మెల్సీ, రూరల్ కాంగ్రెస్అభ్యర్థి భూపతిరెడ్డి కోరారు. శనివారం మోపాల్ మండలంలో భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్శ్రేణులు నర్సింగ్పల్లి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు గడిచిన తొమ్మిదేండ్లలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లెక్కకు మించి హామీలవ్వడం, ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే వాటిని పక్కనబెట్టడం బీఆర్ఎస్కు అలవాటయిందన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమ కోసం పాటుపడే కాంగ్రెస్ను ఆదరించి తనను గెలిపించాలన్నారు.