విద్యుత్ సేవలు మరింత మెరుగు..పారదర్శకత.. వేగవంతమైన సర్వీస్

విద్యుత్ సేవలు మరింత మెరుగు..పారదర్శకత.. వేగవంతమైన సర్వీస్
  • టైఫ్రెమింగ్​తో సమస్యలు పరిష్కారం
  • జిల్లా ఎన్​పీడీసీఎల్​లో గణనీయ మార్పులు

నిజామాబాద్, వెలుగు:  జిల్లాలో విద్యుత్​సేవలు మరింత మెరుగయ్యాయి. సప్లయ్​లోపాలు గుర్తించడానికి నయా టెక్నాలజీ వాడుతున్నారు. పొలం బాటతో రైతులకు వద్దకు వెళ్లడమే కాకుండా కస్టమర్​ నుంచి ఆన్​లైన్​ ఫిర్యాదు రావడమే ఆలస్యం గడువు విధించి మరీ పరిష్కరిస్తున్నారు.  

వారంలో 3 రోజులు రైతులతో..

జిల్లాలో మొత్తం 7,97,731 కరెంట్​ కనెక్షన్లు​ఉండగా అందులో డొమెస్టిక్​ 5,19,358,  వ్యవసాయ బోర్​ కనెక్షన్లు 1,79,739 ఉన్నాయి. ఇండస్ట్రియల్​ ఇతర కేటగిరీ కనెక్షన్లు 98,634 ఉన్నాయి. 17 సర్కిళ్ల పరిధిలో మొత్తం 225 సబ్​ స్టేషన్​లుండగా నిత్యం ఎక్కడో చోట సప్లయ్​ సమస్యలు ఉండేవి. వ్యవసాయానికి క్వాలిటీ విద్యుత్​సరఫరా చేయడంలో గవర్నమెంట్​ రాజీపడడంలేదు. ఆ విషయం గ్రహించిన ఇంజినీర్లు ప్లానింగ్​తో వెళ్లడం రిజల్ట్ ఇస్తోంది.

ప్రతీ మంగళ, గురు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 వరకు పొలంబాట నిర్వహిస్తూ రైతుల వద్దకు వెళ్లడంతో గ్రౌండ్​లో​ సమస్యలు తెలుస్తున్నాయి. ఇలా గడిచిన పది నెలల్లో 1,200 సమస్యలను  పరిష్కరించారు.  మిడిమిడి జ్ఞానంతో విద్యుత్ పోల్స్​, ట్రాన్స్​ఫారాలు ఎక్కి ప్రమాదాలు తెచ్చుకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు. 1912 టోల్​ఫ్రీ నంబర్​కు విస్తృత ప్రచారం చేయడంతో జనవరి నుంచి ఇప్పటివరకు 1,246  ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిని పరిష్కరించి ఫీడ్​బ్యాక్​ తీసుకోవడం విశేషం. 

పిడుగుల ప్రొటెక్షన్​కు లైట్నింగ్​ అరెస్ట్​లు 

వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో పాటు ట్రాన్స్​ఫారాలపై పిడుగులు పడ్డప్పుడు రోజుల తరబడి బ్రేక్​డౌన్​ ఉండేది. దానిని నివారించడానికి 127 లోకేషన్స్​లో లైట్నింగ్​ అరెస్ట్​ పరికరాలు ఏర్పాటు చేశారు. ట్రాన్స్​ఫారంపై పడడానికి వస్తున్న పిడుగును ఈ పరికరం పక్కకు డైవర్ట్​ చేస్తుంది. సప్లయ్​ లోపాన్ని గుర్తించడానికి 978 ఫీడర్స్​కు యూనిక్ ​ పోల్​ నంబర్​ ఇచ్చి ట్రాకింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సప్లయ్​ సమస్య గుర్తించడానికి ఫీల్డ్​లో ​రోజుల కొద్దీ తిరిగే విధానానికి స్వస్తి చెబుతూ ప్రాబ్లం ఉన్న లొకేషన్​ను ట్రాక్​ చేసే సిస్టంను తెచ్చారు.

కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి ఈ-స్టోర్​ నుంచి మెటీరియల్​ డ్రా చేయడం పారదర్శకతను పెంచి అక్రమాలకు కళ్లెం వేస్తోంది.  పరిశ్రమల కనెక్షన్​ల కోసం అమలు చేస్తున్న సింగిల్​ విండో విధానంతో దరఖాస్తుదారులు ఫీజిబిలిటీని ఎస్​ఎంఎస్​ రూపంలో తెలుసుకుంటున్నారు. తాజాగా ఈ నెల 15న జిల్లాలో ఎమర్జెన్సీ రెస్టోరేషన్​ టీంను ఏర్పాటు చేశారు. కరెంట్​ సప్లయ్​ సమస్య ఎక్కడ తలెత్తినా నిమిషాల్లో వాలిపోయేలా 14 వెహికల్స్​తో స్టాఫ్​ను రెడీగా పెట్టారు. 1912 టోల్​ఫ్రీ నంబర్​ ఫిర్యాదులను ఈ టీం అటెండ్​ చేస్తుంది. వాహనాలకు జీపీఆర్​ఎస్ ట్రాకింగ్​ పెట్టారు. ​ 

లోపాలు లేని సేవలు లక్ష్యం

అన్ని రంగాలకు క్వాలిటీ కరెంట్​ ఇవ్వాలని గవర్నమెంట్​ నుంచి ఆదేశాలున్నాయి. దాని ప్రకారమే పనిచేస్తున్నం. తమ ప్రపోజల్స్​కు తక్షణ శాంక్షన్స్​ లభించడంతో ఉత్సాహం పెరుగుతున్నది. ఇంజినీర్లు ఇస్తున్న కొత్త ప్లానింగ్​ అమలు చేయడంతో అద్భుత ఫలితాలు చూస్తున్నం.- రాజేశ్వర్​రావు, ఎస్​ఈ, నిజామాబాద్​