శివ్వంపేట మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్రామంలో కాంగ్రెస్ గెలుపు

శివ్వంపేట మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్రామంలో  కాంగ్రెస్ గెలుపు

శివ్వంపేట, వెలుగు: మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్​ నియోజకవర్గ బీఆర్ఎస్​ఎమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి స్వగ్రామమైన శివ్వంపేట మండలం గోమారంలో కాంగ్రెస్​బలపర్చిన అభ్యర్థి సర్పంచ్​గా గెలుపొందారు. 

కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి హైమావతికి 1,115 ఓట్లు రాగా బీఆర్ఎస్​ బలపర్చిన​అభ్యర్థి జయమ్మకు 614 ఓట్లు, కాంగ్రెస్​రెబల్​అభ్యర్థి స్వప్నకు 586  ఓట్లు వచ్చాయి.  హైమావతి సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్​మద్దతుదారు జయమ్మపై 482 ఓట్ల మెజార్టీతో గోమారం సర్పంచ్​గా గెలుపొందారు.