హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం దిశగా వెళ్తోంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 35ను దాటింది. 40 సీట్లల్లో కాంగ్రెస్ 25 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందగా, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో వైపు హిమాచల్ లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
హిమాచల్ప్రదేశ్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటామని అన్నారు.