బంగ్లాలో హిందువులపై దాడులు అమానుషం : ఏఐటీయూసీ నేత అక్బర్ అలీ

బంగ్లాలో హిందువులపై దాడులు అమానుషం : ఏఐటీయూసీ నేత అక్బర్ అలీ
  •     ఇస్లామిక్​ కొత్త సంవత్సర క్యాలెండర్​ఆవిష్కరించిన ముస్లిం లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​ పట్టణంలోని బిలాల్​ మసీద్​లో శుక్రవారం 2026 సంవత్సర  ఇస్లామిక్ క్యాలెండర్​ను కాంగ్రెస్​ నేత, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్​ కమిటీ ప్రెసిడెంట్​అబ్దుల్​అజీజ్, ఏఐటీయూసీ నేత అక్బర్​ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు చేయడం అమానుషమని, ఈ ఘటనలను తమ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 

ఖురాన్, హదీసుల ప్రకారం ముస్లింలు తమ జీవితాన్ని గడపాలని, తోటి వారితో సఖ్యంగా ఉంటూ సుఖసంతోషాలతో గడపాలన్నారు. కార్యక్రమంలో బిలాల్ మస్జీద్ మోజన్ పాషా, సదర్​ఆరిఫ్, మత పెద్దలు ఖాజా షరీఫ్, నజీర్, ఖాజా, ఇమ్రాన్, అన్వర్, నజీరోద్దిన్, అంకుశ్, పాషా, షబ్బీర్​అలీ, ఇమ్రాన్​తదితరులు పాల్గొన్నారు.