TRSలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

TRSలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మరో ముఖ్య నేత హ్యాండిచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ కండువా కప్పి మోహన్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆరెపల్లి గత అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పెద్దపల్లి లోక్ సభ సీటును ఆయన అశించారు. అయితే వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మెహన్.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.