బీఆర్ఎస్​ కార్యకర్తపై కాంగ్రెస్​ లీడర్​ దాడి.. కుటుంబసభ్యులనూ వదల్లే..

బీఆర్ఎస్​ కార్యకర్తపై కాంగ్రెస్​ లీడర్​ దాడి.. కుటుంబసభ్యులనూ వదల్లే..

ఊరి వాట్పాప్​​ గ్రూప్​లో
బీఆర్​ఎస్​కు విషెశ్​ చెప్తూ  పోస్ట్​ పెట్టినందుకే...

తుంగతుర్తి, వెలుగు: గ్రామ వాట్సాప్ గ్రూ పులో బీఆర్ఎస్ లీ డర్ల ఫొటోలతో న్యూ ఇయర్ విషెశ్​ చెప్తూ పోస్టు పెట్టినందుకు ఆ పార్టీ కార్యకర్త, కుటుంబసభ్యులపై కాంగ్రెస్ లీడర్ దాడి చేశాడు. బాధితుడు నున్న మహేశ్​కథనం ప్రకారం..సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో న్యూ ఇయర్​ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, కేటీఆర్ ఫొటోలను షేర్​ చేస్తూ మహేశ్ ​శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఊరి సర్పంచ్​, కాంగ్రెస్ ​లీడర్​  జూల నర్సయ్య అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లీడర్ల ఫొటోలు ఎందుకు పెట్టావంటూ సోమవారం రాత్రి మహేశ్​ పై దాడి చేశాడు.

తన అన్నను కొట్టొద్దని మహేశ్​ తమ్ముడు శ్రవణ్ , తల్లి వీరమ్మ అడ్డువెళ్లగా వారినీ వదల్లేదు. గాయపడ్డ ముగ్గురిని సూర్యాపేటలోని ప్రైవేట్ ​దవాఖానాలో చేర్పించారు. ఘటనపై  ఫిర్యాదు చేసినట్లు మహేశ్​ తెలిపాడు.  పాత కక్షలను మ నసులో పెట్టుకునే దాడి జరిగిందన్నాడు.  02TGT01 కాంగ్రెస్​లీడర్​దాడిలో గాయపడ్డ శ్రవణ్​​02TGT02  : గాయపడ్డ మహేశ్​తల్లి వీరమ్మ