పెరాలిసిస్ బాధితుడికి గడ్డం వంశీకృష్ణ సాయం

పెరాలిసిస్ బాధితుడికి గడ్డం వంశీకృష్ణ సాయం

పెరాలసీస్ తో బాధపడుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించారు గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలో నివాసముంటున్న నాగపూరి శ్రీనివాస్ గౌడ్ కు.. కొన్ని రోజుల క్రితం బ్రెయిన్ ఆపరేషన్ చేశారు వైద్యులు. దీంతో పెరాలసిస్ తో  బాధపడుతున్న విషయం తెలుసుకున్న అల్లం సతీష్,  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణకు తెలియజేశారు. తన ప్రతినిధులను శ్రీనివాస్ ఇంటికి పంపించి 5వేల రూపాయలను మెడికల్ ఖర్చుల కోసం అందజేశారు వంశీకృష్ణ. గడ

గడ్డం వంశీకృష్ణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వంశీకృష్ణ త్వరలో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.