టీఎంసీలో చేరనున్న టీమిండియా మాజీ క్రికెటర్

టీఎంసీలో చేరనున్న టీమిండియా మాజీ క్రికెటర్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత దూకుడు పెంచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) అధినేత్రి,  ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సినీ నటులను టీఎంసీలోకి చేర్చుకుంటూ ఆ పార్టీకి గ్లామర్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్, 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టులోని సభ్యుడు అయిన కీర్తి ఆజాద్ టీఎంసీ లో చేరేందుకు రెడీ అయ్యారు.

బీహార్ మాజీ సీఎం భగవత్ ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ దర్భంగా నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మొదట బీజేపీలో ఉన్న ఆయన  ఆ తర్వాత ఆ పార్టీని వీడి 2019లో కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధన్‌బాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు టీఎంసీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇవాళ( మంగళవారం) ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కీర్తి ఆజాద్ టీఎంసీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.