దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్న మోడీ

దేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్న మోడీ

న్యూఢిల్లీ: పీఎం మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన మిత్రులను ధనవంతులను చేసేందుకు సామాన్యులను మోడీ దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. సామాన్యులు ఆత్మహత్య చేసుకుంటుంటే... మోడీ స్నేహితులు మాత్రం కుబేరులవుతున్నారని మండిపడ్డారు.

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి చేరారు. దీంతో అదానీ పేరు ప్రస్తావించకుండా రాహుల్ పీఎం మోడీని విమర్శించారు. దేశంలో ప్రతి గంటకు ఐదుగురు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. అదే టైంలో మోడీ ప్రియ మిత్రుడు రూ.85 కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. బీజేపీ దేశాన్ని పేదల భారత్... ధనికుల భారత్ అని విభజిస్తోందని ఫైర్ అయ్యారు.