హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం హేయమైన, అనాగరికమైన చర్య అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో నాగం జనార్దన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్ల మాటలు, చర్యలు చూసి కార్యకర్తలు కూడా అలాగే తయారవుతున్నారని, ప్రభాకర్ రెడ్డిపై దాడి ఆ కోవలోకే వస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలోనే హింసను ప్రోత్సహిస్తున్నారని, వాళ్ల తీరు, భాష మార్చుకోవాలన్నారు.
తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం కోసం తమకు తాముగా బలిదానాలు చేసుకున్నారే తప్పా ఎవరిపైనా దాడులు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ది ఆర్టిఫిషియల్ హైప్అని నాగం అన్నారు. ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతున్నదన్నారు. పొంగులేటి, జూపల్లి లాంటి వాళ్ల చేరికతో వచ్చింది పాల పొంగు మాత్రమేనన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని, ప్రజా సేవ చేయడానికే బీఆర్ఎస్లోకి వచ్చానన్నారు. బీఆర్ఎస్లోకి వస్తే తన కుటుంబంలోకి వచ్చినట్టు ఉందన్నారు.