
జగిత్యాల రూరల్, వెలుగు: కాంగ్రెస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్ మాట్లాడుతూ లక్ష్మణ్ కుమార్ విద్యార్థి నాయకుడి నుంచి జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి పొందడం హర్షణీయమన్నారు.
గొల్లపల్లి, వెలుగు: ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా గొల్లపల్లి మండలకేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఓడినా, అవమానాలు ఎదురైనా ప్రజలను నమ్ముకొని ఉన్న గొప్ప నేత అడ్లూరి అని కొనియాడారు. అనంతరం పలువురు లీడర్లు హైదరాబాద్ తరలివెళ్లి మంత్రిని కలిసి విషెస్ చెప్పారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, రాజిరెడ్డి, గంగాధర్, సత్యనారాయణ గౌడ్, తిరుపతి రెడ్డి, వెంకటేశం, లింగయ్య, తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.
కోరుట్లలో..
కోరుట్ల, వెలుగు: మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం సందర్భంగా కోరుట్లలో ఎమ్మార్పీఎస్, మాదిగ కుల సంఘం ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. లీడర్లు మోర్తాడ్ లక్ష్మీనారాయణ, శనిగారపు రాజేశ్, శంకర్, లచ్చయ్య, కిరణ్, మహేందర్ పాల్గొన్నారు.
కరీంనగర్ సిటీ: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అడ్లూరిని హైదరాబాద్లో సుడా చైర్మన్ నరేందర్రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.