మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన పలువురు నేతలు

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన పలువురు నేతలు

శివ్వంపేట, తుప్రాన్​, సిద్దిపేట, కొహెడ, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా నియమితులైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని శుక్రవారం హైదరాబాద్​లో పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, తూప్రాన్ కు చెందిన  కాంగ్రెస్ నాయకులు మామిండ్ల కృష్ణ, బజారు విశ్వరాజ్,  సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి  పూజల హరికృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షుడు చొప్పదండి చంద్రశేఖర్, కౌన్సిలర్స్ సాకీ ఆనంద్, రియాజ్, కాంగ్రెస్ నాయకులు గుండు రవితేజ,  బయ్యారం యాదగిరి, బత్తుల ప్రశాంత్,  కోహెడ మండలం శ్రీరాములపల్లికి చెందిన మాల సంఘం నాయకుడు మరాటి మణిదీప్​ మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. ఉమ్మడి మెదక్ ​జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బడుగు బలహీన వర్గాల  కోసం పని చేసిన కాకా ఫ్యామిలీ నుంచి వివేక్  వెంకటస్వామికి మంత్రి పదవి రావడం  సంతోషంగా ఉందన్నారు.