జూబ్లీహిల్స్ తొలి రౌండ్‎లో కాంగ్రెస్‎కు ఆధిక్యం.. షేక్ పేట్‎లో సత్తాచాటిన అధికార పార్టీ

జూబ్లీహిల్స్ తొలి రౌండ్‎లో కాంగ్రెస్‎కు ఆధిక్యం.. షేక్ పేట్‎లో సత్తాచాటిన అధికార పార్టీ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. తొలి రౌండ్‎లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. షేక్ పేట్ డివిజన్‎లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం సాధించింది. తొలి రౌండ్‎లో కాంగ్రెస్‎కు 8926, బీఆర్ఎస్‎కు 8864 పడ్డాయి. మొదటి రౌండ్‎లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల లీడ్ దక్కింది. ఈవీఎంల కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీకి 10 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం సాధించింది. 

ఈవీఎం మొదటి రౌండ్ వివరాలు: 

  • కాంగ్రెస్‎కు పోలైన ఓట్లు 8926
  • బీఆర్ఎస్‎కు పోలైన ఓట్లు- 8864
  • మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల లీడ్