బీజేపీ ట్రాప్ లో కేసీఆర్

బీజేపీ ట్రాప్ లో కేసీఆర్

8 మంది ఎంపీలున్న కేసీఆర్.. 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ ను విమర్శించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కాంగ్రెస్ ను విమర్శించడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ ఉనికి లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 57 సీట్లున్న కాంగ్రెస్ భవిష్యత్తులో 200ఎంపీ సీట్లు గెలిచే ఛాన్సుందని... కానీ టీఆర్ఎస్ కు అది సాధ్యమవుతుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని, ఆయన ప్రకటనలు హాస్యస్పదంగా మారాయని వ్యాఖ్యానించారు.  తప్పుడు ప్రకటనలు, అనాలోచిత నిర్ణయాల వల్ల కేసీఆర్ బీజేపీకి బలాన్ని చేకూరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే బీజేపీ ఎదుగుతోందని, బీజేపీ ఎదిగిన కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. కేసీఆర్ పూర్తిగా బీజేపీ ట్రాప్ లో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు బీజేపీ , ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు.