స్వాతంత్య్రం కోసం ఒక్క బీజేపీ నాయకుడైనా ప్రాణాలు ఇచ్చాడా

స్వాతంత్య్రం కోసం ఒక్క బీజేపీ నాయకుడైనా ప్రాణాలు ఇచ్చాడా

దేశంలో గాంధీ ఫ్యామిలీ ఉండకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను నిరసిస్తూ టీకాంగ్రెస్  హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశసేవలో ప్రాణాలు కోల్పోయారని..అటువంటి కుటుంబాన్ని దేశంలో లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్,బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. 

స్వాతంత్ర్యం కోసం బీజేపీకి చెందిన ఒక్క నాయకుడైనా ప్రాణాలు ఇచ్చాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారన్న కక్షతోనే ఈడీ కేసులతో కేంద్రం వేధిస్తోందని మండిపడ్డారు. అయితే బీజేపీ నాయకుల అవినీతిపై మాత్రం ఎటువంటి కేసులండవని విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సే గొప్పవాడని కేంద్రం అనడం సిగ్గుచేటన్నారు. బీజేపీ కుట్రను సమర్ధంగా తిప్పికొట్టి సోనియాగాంధీ నాయకత్వంలో ప్రజాసమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.