
పరకాల, వెలుగు : కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాష్ర్ట ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా పరకాలలోని మహాదేవ కన్వెన్షన్హాల్లో పరకాల, పరకాల పట్టణం, నడికుడ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశంపట్టణాధ్యక్షడు కొయ్యడ శ్రీనివాస్అధ్యక్షతన నిర్వహించారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, పదేండ్ల పాలనలో బీసీలను చిన్నచూపు చూసింది ఎవరి హయాంలో అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండలాధ్యక్షుడు కట్కూరి దేవేందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.