కోరుట్ల, వెలుగు : 2014, 18 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని మాజీ సీఎం కేసీఆరే ఒక 420 అని, చీటింగ్ పేటెంట్ రైట్స్ ఆయనకే దక్కుతాయని ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావుతో కలిసి మాట్లాడారు. కేసీఆర్తెలంగాణ ఖజానాను ఖాళీ చేశాడన్నారు. ఆయన పదేండ్ల పాలనలో కనీసం రేషన్కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారని స్పష్టం చేశారు.
2018 ఎన్నికలకు ముందు నాటి మంత్రి హరీశ్రావు ప్రారంభించిన సదర్మాట్ బ్యారేజీ ఇంత వరకు కొలిక్కి రాలేదన్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని, అంతకుమించి బీఆర్ఎస్ హయాంలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు. ఆయన హయాంలోనే కోరుట్లలో పశు వైద్య కాలేజీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నిరుద్యోగ యువత కోసం త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారని చెప్పారు. జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్లలోని వెటర్నరీ కాలేజీకి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్రావు పేరు పెట్టాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి.. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జీవన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కేక్కట్చేయించారు.
కాంగ్రెస్లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్
బీఆర్ఎస్కు చెందిన కోరుట్ల మున్సిపల్ వైస్చైర్మన్ గడ్డమీద పవన్, ఎనిమిది మంది కౌన్సిలర్లు శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. నాగభూషణం, వెంకటేశ్, కమల, మధు, లింగం, అబ్దుల్ రహీం, వేణు, రియాజ్ చేరిన వారిలో ఉన్నారు.