
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నేతలతో రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు అవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు,డీసీసీ అధ్యక్షులతో కొన్ని రోజుల నుంచి వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో జూన్ 1న వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు.అలాగే మెదక్,ఆదిలాబాద్,కరీంనగర్ ఎంపీ అభ్యర్థులతో కూడా భేటీ అయ్యారు. పార్టీ ,ప్రభుత్వ పనితీరుపై ఆరాదీశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మంత్రి కొండా సురేఖ కూడా మీనాక్షి నటరాజన్ ను కలిశారు. జిల్లా నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో మీనాక్షిని కలిసి వివరణ ఇచ్చారు కొండా సురేఖ.విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ విజయశాంతి కూడా మీనాక్షి నటరాజన్ ను కలిశారు. 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈసందర్బంగా బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరారని సమాచారం.
ALSO READ | పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా
జూన్ ఫస్ట్ వీక్ లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్ ల 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా మరో ఆరుగురికి చాన్స్ ఉంది. దీంతో ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.