కరోనాతో కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ (70) మృతి

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ (70) మృతి

చెన్నై: కరోనా మహమ్మారి బారిన పడి కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ హెచ్‌.వసంతకుమార్ (70) చనిపోయారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల 10న కుమార్ చెన్నైలోని ప్రైవేట్ మల్టీ లెవల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన మృతి చెందిన విషయాన్ని కుమార్‌‌కు ట్రీట్‌మెంట్ అందిస్తున్న సదరు ఆస్పత్రి వర్గాలు శుక్రవారం తెలిపాయి. కుమార్ రాజకీయ కెరీర్‌‌ను పక్కనబెడితే వసంత్‌ అండ్ కో పేరుతో చైన్‌ ఆఫ్ షాప్స్‌ను నడుపుతూ బిజినెస్‌మేన్‌గా విజయవంతమయ్యారు. వసంతకుమార్ మృతిపై కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. పోరాటు యోధుడైన కుమార్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. పార్టీ సభ్యులతోపాటు లక్షలాది మద్దతుదారులు కుమార్‌‌ను మిస్సవుతున్నారని చెప్పారు.