హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా కారణంగా రోజుకు రెండు ప్రాణాలు పోతున్నాయని, వెంటనే వీరి అరాచకాలను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ప్రతి రోజు వందలాది లారీలు 150 టన్నుల ఓవర్ లోడ్తో వెళ్తున్నాయని, దీంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఈ మధ్యే ఓవర్ లోడ్తో దూసుకొచ్చిన లారీ కింద పడి 32 ఏండ్ల యువకుడు చనిపోయాడన్నారు. గుంతల కారణంగా జరిగిన యాక్సిడెంట్లో ప్రశాంత్ మృతి చెందాడని తెలిపారు. సీఎం స్పందించి.. రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు.