
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అనర్హుడిగా ప్రకటించి రాహుల్ గొంతునొక్కారని విమర్శించారు. రాహుల్పై అనర్హత వేటుకు సంఘీభావంగా మార్చి 26న గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని కోమటిరెడ్డి చెప్పారు.
రాహుల్ గాంధీ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, ఖర్గే ఆదేశిస్తే తామంతా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సభ్యులమంతా ఒకే మాటపై ఉంటామన్నారు.