- కాంగ్రెస్, టీజేఎస్ పొత్తుపై డైలమా
- టికెట్లపై ఇంకా క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్
- మిగిలిన 19 సీట్లలోనైనా ఇస్తరా? లేదా? అన్నదానిపై సందిగ్ధం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్తో టీజేఎస్ పొత్తు అంశం కొలిక్కి రావటం లేదు. శుక్రవారం మరో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇంకో19 సీట్లను పెండింగ్లో ఉంచింది. ఇందులో లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు ఇస్తుండగా.. మిగతా15 సీట్లలో అయినా టీజేఎస్ కు ఇస్తరా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావడంలేదు. కాంగ్రెస్ పెండింగ్లో ఉంచిన 19 సీట్లలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ సీట్లే ఉన్నాయి. ఈ 19 సీట్లలో కూడా కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
అయితే టీజేఎస్ అడిగిన 4 స్థానాల్లో (ఎల్లారెడ్డి, కోరుట్ల, ముథోల్, జహీరాబాద్) కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని కరీంనగర్లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు పార్టీ నేతలు కలిసి ఈ 4 టికెట్లు ఇవ్వాలని కోరారు.
కోదండారం ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన రాహుల్.. త్వరలో పీసీసీ చీఫ్ రేవంత్ టీజేఎస్ ఆఫీస్కు వచ్చి చర్చలు జరుపుతారని హామీ ఇచ్చారు. అయితే రాహుల్ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి కోదండరాంతో చర్చలు జరపలేదు. దీనిపై కోదండరాం స్పందిస్తూ.. మిగతా సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మాట్లాడతానని చెప్పారు.