నల్ల కండువాలతో కాంగ్రెస్ నిరసన… రాజగోపాల్ రెడ్డి సైలెన్స్

నల్ల కండువాలతో కాంగ్రెస్ నిరసన… రాజగోపాల్ రెడ్డి సైలెన్స్

కాంగ్రెస్ శాసన సభ్యులు ఇవాళ అసెంబ్లీలో నిరసన ప్రదర్శన చేశారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సింగ్ తో.. నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీ విలీనంపై నిరసన తెలిపారు.

అసెంబ్లీ సీటింగ్ లో మార్పుచేశారు అధికారులు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీవైపు సీట్లు కేటాయించారు.

ఫిరాయింపులకు వ్యతిరేకంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోనూ నినాదాలు చేశారు. ఐతే.. భట్టి విక్రమార్క సహా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుండగా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకొచ్చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నిరసనకు మద్దతివ్వలేదు. ఆయన సైలెంట్ గా ఉండిపోయారు.