ట్రంప్అబద్ధం ఆడుతుండని చెప్పే దమ్ము మోడీకి లేదు: రాహుల్ గాంధీ

ట్రంప్అబద్ధం ఆడుతుండని చెప్పే దమ్ము మోడీకి లేదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: భారత్– పాక్​మధ్య సీజ్​ఫైర్​ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ చెప్పలేకపోతున్నారని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ విమర్శించారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపడంలో తాను కీలక పాత్ర పోషించానని ఇప్పటివరకూ  ట్రంప్​ దాదాపు 30 సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఆపరేషన్​ సిందూర్‎పై లోక్​సభలో చర్చ సందర్భంగా గంటకు పైగా ప్రసంగించిన మోదీ.. ట్రంప్​ ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. బుధవారం పార్లమెంట్​ హౌస్​ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్​గాంధీ మీడియాతో మాట్లాడారు. 

సీజ్‌‌‌‌‌‌‌‌ఫైర్​విషయంలో ట్రంప్​అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ చెప్పలేరని, అలా చేస్తే ట్రంప్​అసలు నిజాలు ఎక్కడ బయటపెడతారోనని మోదీ భయపడుతున్నారని అన్నారు. ‘‘ట్రంప్ అబద్ధం చెబుతున్నారని మోదీ చెప్పలేదు. అక్కడ ఏం జరిగిందో క్లియర్‎గా ఉంది. అయినా.. ట్రంప్​అబద్ధం ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు. ట్రంప్ చెప్పేది అబద్ధమని చెబితే.. ఆయనే బహిరంగంగా నిజం చెబుతారు. అందుకే ప్రధాని ఏం చెప్పలేకపోతున్నారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ట్రేడ్​డీల్​కోసం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి వాణిజ్య ఒప్పందం జరుగుతుందో మనమందరం చూస్తున్నామంటూ ఎద్దేవా చేశారు.


మోదీ తీరు అనుమానంగా ఉంది: ఖర్గే

సీజ్​ఫైర్​ విషయంలో ట్రంప్​ అబద్ధాలు చెబుతున్నారని చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ తీరు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉన్నదని తెలిపారు. చర్చల్లో థర్డ్​పార్టీ మధ్యవర్తిత్వాన్ని తాము ఎప్పుడూ అంగీకరించలేదని, అది ఇప్పటికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు.  ‘‘మరి దీనిని వారు ఎందుకు అంగీకరించారు? ఇందుకు గల కారణాలు ఏంటి? అనేది వారు (కేంద్ర సర్కారు) దేశానికి చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. 

మోదీ తన  ప్రసంగంలో ఒక్కసారి కూడా ట్రంప్ పేరును ప్రస్తావించలేదని అన్నారు.  సీజ్​ఫైర్​ విషయంలో  ట్రంప్ వ్యాఖ్యలను ఖండించి, ఆయన భారత ప్రతిష్టను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ చెప్పి ఉండాల్సింది అని ఖర్గే అన్నారు.  కాగా, ట్రంప్​ అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ లోక్‌‌‌‌‌‌‌‌సభలో స్పష్టం చేసి ఉండాల్సిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు.