
ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒకటి. ఈనెల 14న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. తాజాగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 30 మందితో కూడిన లిస్ట్ను పార్టీ విడుదల చేసింది.వీరిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ ఇతర నేతలు ఉన్నారు.
ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్ అంతర్భాగంగా ఉండేది. అయితే 2000 ఏడాదిలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అనంతరం రెండేళ్లకు తొలిసారి అక్కడ 2002లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొత్తం 70 సీట్లకుగానూ కాంగ్రెస్ 36 చోట్ల విజయం సాధించింది. అనంతరం 2007 ఎన్నికల్లో బీజేపీ గెలుపొంది అధికారం చేపట్టింది. తాజాగా మరోసారి అక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. ఎన్నికల ప్రచారానికి సోనియా, మన్మోహన్ వంటి అగ్రనేతలు కదిలి వస్తున్నారు. మరి ఉత్తరాఖండ్ ప్రజలు ఎవరికి పగ్గాలు అప్పగిస్తారో వేచి చూడాలి.
Congress released the list of star campaigners for the Uttarakhand Assembly elections to be held on February 14.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 2, 2022
List of 30 leaders of Congress campaigners included the names of Sonia Gandhi, Dr Manmohan Singh, Rahul Gandhi, Priyanka Gandhi Vadra and Punjab CM Charanjit S Channi pic.twitter.com/xUy6swaQE3